Srikakulam District: ఇచ్చాపురంలోకి రాగానే... కీలక హామీ ఇచ్చిన వైఎస్ జగన్!

  • ఇచ్చాపురంలోకి ప్రవేశించిన జగన్
  • కిడ్నీ బాధితులకు నెలకు రూ. 10 వేల పింఛన్
  • కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్న జగన్

కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర చివరి నియోజకవర్గమైన ఇచ్చాపురంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జగన్ కు ఘనస్వాగతం లభించింది. పలువురు నాయకులు, కార్యకర్తలు, జగన్ పై పూలవర్షం కురిపించారు. నేడు 336వ రోజు పాదయాత్ర సాగుతుండగా, వైఎస్ జగన్ ను ఏడు గ్రామాలకు చెందిన కిడ్నీ వ్యాధిగ్రస్తులు కలిశారు.

ఈ సందర్భంగా వారికి భరోసాను కల్పిస్తూ, అధికారంలోకి రాగానే, నెలకు రూ. 10 వేల పింఛన్ ను కిడ్నీ బాధితులకు ఇస్తానని కీలక హామీని ఇచ్చారు. ఈ ప్రభుత్వం బాధితులకు ఎలాంటి సహాయాన్నీ అందించడం లేదని ఆరోపించిన జగన్, కనీసం సరిపడా డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు కాలేదని విమర్శించారు. ఈ ప్రాంతంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను ఏర్పాటు చేస్తానని, వంశధార మహేంద్రతనయ నుంచి సురక్షిత నీటిని అందిస్తానని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News