prabhas: ప్రభాస్ తో దిల్ రాజు సంప్రదింపులు

  • 'కేజీఎఫ్' దర్శకుడిగా ప్రశాంత్ నీల్ 
  • కథ రెడీ చేయమని చెప్పిన ప్రభాస్ 
  • రంగంలోకి దిగిన దిల్ రాజు  

దిల్ రాజు .. ప్రభాస్ కాంబినేషన్లో గతంలో 'మున్నా' .. 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మరోసారి ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ .. సుజిత్ దర్శకత్వంలో 'సాహో' సినిమా చేస్తున్నాడు. ఇక 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించాడు. ఈ సినిమాకి 'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఈ సినిమా తరువాత ప్రభాస్ .. 'కేజీఎఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మంచి కథను రెడీ చేయమని ఆయనకి ప్రభాస్ చెప్పాడట. ఈ సినిమాను నిర్మించడానికి దిల్ రాజు ముందుకు వచ్చాడనేది తాజా సమాచారం. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించడానికి దిల్ రాజు తన సంసిద్ధతను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక విభిన్నమైన కథాకథనాలతో ప్రభాస్ .. దిల్ రాజులను ఒప్పించవలసిన బాధ్యత ప్రశాంత్ నీల్ పైనే ఉందన్న మాట. 

  • Loading...

More Telugu News