Chandrababu: ఏపీ హైకోర్టుపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు

  • హైకోర్టు నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందని ప్రశ్నించిన సీఎం
  • జనవరి 22 నాటికి పూర్తవుతుందన్న నిర్మాణ సంస్థ
  • క్యాంపు కార్యాలయంలో కోర్టు హాళ్లను సిద్ధం చేస్తున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైకోర్టు నిర్మాణం ఎప్పటిలోగా పూర్తవుతుందని అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. జనవరి 22 నాటికి పూర్తి చేస్తామని హైకోర్టును నిర్మిస్తున్న కాంట్రాక్టు సంస్థ తెలిపింది. నెలాఖరు వరకు సమయం తీసుకుని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆదేశించారు.

హైకోర్టు పూర్తయ్యేంత వరకు సీఎం క్యాంపు కార్యాలయంలో తాత్కాలిక హైకోర్టును ఏర్పాటు చేయాలని, స్టేట్ గెస్ట్ హౌస్ ను పాలనా సిబ్బందికి కేటాయించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో, క్యాంపు కార్యాలయంలో కోర్టు హాళ్లను సీఆర్డీయే అధికారులు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేస్తున్నారు. నేలపాడు గ్రామంలో హైకోర్టు భవనాన్ని ఎల్ అండ్ టీ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News