Hyderabad: గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి.. రెచ్చిపోయిన కుటుంబసభ్యులు

  • లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో ఘటన
  • ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నాం
  • నిందితులపై కేసు నమోదు చేశామన్న పోలీసులు 

హైదరాబాద్, లక్డీకాపూల్ లోని గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ ముస్లిం మహిళ మృతి చెందింది. దీంతో, ఆగ్రహించిన మృతురాలి కుటుంబసభ్యులు ఆసుపత్రిని ధ్వంసం చేశారు. రిసెప్షన్ కౌంటర్ లోని రెండు కంప్యూటర్లు, ఆసుపత్రిలోని ఫర్నిచర్ తదితర వస్తువులు ధ్వంసమయ్యాయి.

ఈ ఘటనపై సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ, ఛాతినొప్పితో బాధపడుతున్న షమీన్ బేగం గ్లోబల్ ఆసుపత్రిలో చేరారని, చికిత్స అందిస్తున్న సమయంలో ఆమె మృతి చెందిందని చెప్పారు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె కుటుంబసభ్యులు, బంధువులు ఆసుపత్రిని ధ్వంసం చేశారని అన్నారు. షమీన్ బేగం కుమారులు ముగ్గురు, వారి స్నేహితులు కలిసి ఈ దాడికి పాల్పడ్డారని చెప్పారు.

ఈ ఘటన జరిగిన పదినిమిషాల్లోనే సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లారని, అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారని చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నట్టు చెప్పారు.  

  • Loading...

More Telugu News