bollaram: రేపటి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందర్శనకు అనుమతి

  • 6వ తేదీ వరకు సందర్శించే అవకాశం
  • సందర్శన వేళలు ఉదయం 10 నుంచి సాయంత్రం 4  
  • వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే వాహనాల ద్వారా లోపలికి ప్రవేశం

శీతాకాల విడిదిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రామ్ నాథ్ కోవింద్ బస చేసి వెళ్లిన విషయం తెలిసిందే. 2011 నుంచి రాష్ట్రపతి పర్యటనకు వచ్చి తిరిగి వెళ్లిన అనంతరం ఈ నిలయం సందర్శనకు వారం రోజుల పాటు ప్రజలకు అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ప్రజలను అనుమతించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి నిలయం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు సందర్శించవచ్చు. తమ వాహనాలపై ఇక్కడికి వచ్చే ప్రజలు రాష్ట్రపతి నిలయం ఎదుట ఉన్న పార్కింగ్ స్థలంలో వాటిని ఉంచాలి. వృద్ధులు, దివ్యాంగులు మాత్రం తమ వాహనాల ద్వారా రాష్ట్రపతి నిలయంలోకి ప్రవేశించవచ్చు. కాగా, రాష్ట్రపతి నిలయంలో సుమారు 20 గదులకు పైగా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని అతిథుల కోసం, కార్యాలయ నిర్వహణకు, సమావేశాల నిర్వహణకు  కేటాయించారు. దట్టమైన చెట్లు, వనమూలికా తోట, ఆయుర్వేద మొక్కలు ఈ ప్రాంగణంలో ఉన్నాయి.    

  • Loading...

More Telugu News