Bhanuchandar: వైసీపీ అధినేత జగన్‌లో నాకు బుద్ధుడు కనిపిస్తున్నాడు: సినీ నటుడు భాను చందర్

  • ప్రజా సేవ కోసమే వైసీపీలో చేరా
  • జగన్‌లో ఓర్పు, ఔదార్యం ఉన్నాయి
  • విశాఖలో విలేకరులతో భాను చందర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రముఖ సినీ నటుడు భాను చందర్ ప్రశంసలు కురిపించారు. జగన్‌లో తనకు బుద్ధుడు కనిపిస్తున్నాడని పేర్కొన్నారు. విశాఖపట్టణంలోని దొండపర్తిలో ఉన్న ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ భాను చందర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే  వైసీపీలో చేరినట్టు తెలిపారు. జగన్‌లో ఎంతో ఓర్పు, ఔదార్యం ఉన్నాయని కొనియాడారు.

శ్రీకాకుళం జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఆదివారం టెక్కలిలో జగన్‌ను కలిసిన భానుచందర్ పాదయాత్రలో ఆయనతో పాటు కలిసి నడిచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జగన్ పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకే తాను వచ్చినట్టు చెప్పారు. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం గొప్ప విషయమని ఈ సందర్భంగా భానుచందర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News