srikanth: నా మొదటి పారితోషికం ఐదువేలు!: హీరో శ్రీకాంత్

  • 'పీపుల్స్ ఎన్ కౌంటర్'తో పరిచయం 
  • నక్సలైట్ నాయకుడి పాత్ర 
  • ఇప్పటికీ గుర్తుండిపోయిన డైలాగ్  

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా వెండితెరకి హీరోగా పరిచయం కావడం .. హీరోగా నిలదొక్కుకోవడం అంత తేలికైన పనేం కాదు. అప్పటికే తెలుగు తెరను ఏలేస్తోన్న హీరోల పోటీని తట్టుకుంటూ 125 సినిమాలను పూర్తి చేయడం అంత ఆషామాషీ విషయమేం కాదు. అలాంటి ఫీట్ ను సాధించిన ఘనత శ్రీకాంత్ కి దక్కుతుంది.

తాజా చిత్రంతో 125 సినిమాలను పూర్తిచేసిన సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ .. " ఉషాకిరణ్ మూవీస్ వారి 'పీపుల్స్ ఎన్ కౌంటర్' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమయ్యాను. ఈ సినిమాలో నక్సలైట్ నాయకుడిగా కనిపిస్తాను. అరకులోయలో ఎక్కువభాగం షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో చేసినందుకు గాను నేను అందుకున్న తొలి పారితోషికం 5000. తొలిరోజున కెమెరాముందుకి వెళ్లినప్పుడు పొందిన అనుభూతిని నేను ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ సినిమాలో నేను చెప్పిన ఒక భారీ డైలాగ్ ఇప్పటికీ నాకు కంఠతా వచ్చు" అని అన్నారు.

  • Loading...

More Telugu News