TRS: టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతల ఇంటి ముందు చావు డప్పు కొడతాం: పొన్నం ప్రభాకర్

  • కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ చేర్చుకోవడం సరికాదు
  • పార్టీ మారిన నేతల ఇళ్ల ముందు శవయాత్ర చేయండి
  • రాఫెల్ పై టీఆర్ఎస్ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?

కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన ప్రజాప్రతినిధుల కోసం టీఆర్ఎస్ పార్టీ ఎదురు చూస్తోందని... టీఆర్ఎస్ లో సమర్థులైన నేతలు లేరా? అని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ లో విలీనం చేసుకోవడం సరికాదని ఆయన అన్నారు. టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేతల ఇంటి ముందు చావు డప్పు కోడతామని అన్నారు. పార్టీ మారిన నేతల ఇళ్ల ముందు శవయాత్ర చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ లో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాఫెల్ కుంభకోణం యావత్ దేశాన్ని కుదిపేస్తోందని... అయినా, టీఆర్ఎస్ నేతలు ఎందుకు దానిపై మాట్లాడటం లేదని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకే విభజన హామీలపై పోరాడుతున్నట్టు టీఆర్ఎస్ నేతలు నటిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీ దుకాణం మూసుకోవాలని సూచించారు. రాష్ట్రపతి రాక కోసం ఖర్చు పెట్టిన రూ. 6 కోట్లతో ఆసుపత్రిని నిర్మించి ఉంటే ప్రజలకు ఉపయోగం ఉండేదని అన్నారు. ఎన్నికల్లో ఓటమికి కారణాలు ఏమిటో విశ్లేషిస్తున్నామని చెప్పారు. 

  • Loading...

More Telugu News