Harish Rao: నా గెలుపును సిద్ధిపేట ప్రజలకు, కేసీఆర్ కు అంకితం చేస్తున్నా: హరీశ్ రావు

  • సిద్దిపేట ప్రజలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నా
  •  నా గెలుపులో ప్రజల చెమట బిందువులున్నాయి
  • ఊపిరి ఉన్నంత వరకూ సిద్దిపేటకు సేవకుడిగా ఉంటా

సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ నేత హరీశ్ రావు లక్షా ఇరవై వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంపై హరీశ్ రావు స్పందిస్తూ, ఇంత మెజార్టీతో గెలిపించిన సిద్దిపేట ప్రజలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, తన గెలుపులో సిద్దిపేట ప్రజల చెమట బిందువులున్నాయని అన్నారు. ఈ విజయాన్ని సిద్ది పేట ప్రజలకు, కేసీఆర్ కు అంకితం చేస్తున్నానని అన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ సిద్దిపేటకు సేవకుడిగా పని చేస్తానని చెప్పిన హరీశ్, నాడు ఉద్యమ సమయంలో..నేడు మెజార్టీలో సిద్దిపేటకు సేవకుడిగా పనిచేస్తానని అన్నారు.

  • Loading...

More Telugu News