KTR: మహాకూటమి నేతలను చూసి సంక్రాంతి గంగిరెద్దులు ఊళ్లోకి వచ్చాయనుకుంటున్నారు: కేటీఆర్ ఎద్దేవా

  • ఆడపిల్ల బాకీ తీర్చేదాకా వదిలిపెట్టను
  • కేసీఆర్‌ను గద్దె దించాలని చూస్తున్నాయి
  • డబుల్ బెడ్‌రూమ్ విషయంలో అసంతృప్తి
  • కేసీఆర్ సింహంలా సింగిల్‌గా వస్తున్నారు

ప్రజల కోసం కష్టపడుతున్న కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ను బొంద పెట్టేందుకు పుట్టిన పార్టీని చంద్రబాబు అదే పార్టీకి తోకపార్టీని చేశారని ఎద్దేవా చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మహాకూటమి ఐదు పార్టీల జెండాలు కప్పుకుని ఓట్ల కోసం తిరుగుతున్న నేతలను చూస్తుంటే సంక్రాంతి గంగిరెద్దులు వస్తున్నాయని ఊళ్లలో అనుకుంటున్నారన్నారు. డబుల్ బెడ్‌రూమ్ విషయంలో తనకూ అసంతృప్తి ఉందన్నారు. స్థలం దొరక్కపోవడం, కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాకపోవడమే ఆలస్యానికి కారణమన్నారు.

ఈసారి టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే స్థలం ఉంటే చాలు.. ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. ఈ రోజుల్లో మేనమామ కూడా పెళ్లి చేయడానికి ముందుకు రావడం లేదని, అలాంటిది పేదింటి పిల్ల అయితే కేసీఆర్ రూ.లక్ష ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో పురుగులన్నం పెడితే.. టీఆర్ఎస్ సన్నబియ్యం భోజనం పెడుతోందన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు వచ్చేదాకా.. అలాగే ఆడపిల్ల బాకీ తీర్చేదాకా వదిలిపెట్టబోనని కేటీఆర్ తెలిపారు. రజనీకాంత్ సినిమాలో చెప్పినట్టుగా కేసీఆర్ సింహంలా సింగిల్‌గా వస్తున్నారని.. కానీ వారే గుంపులుగా వస్తున్నారని, అలా వచ్చేవేంటో మీకు తెలుసని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు.

  • Loading...

More Telugu News