nani: నాని ప్లానింగ్ మాములుగా లేదు

  • 'జెర్సీ'తో బిజీగా వున్న నాని 
  • తదుపరి ప్రాజెక్టు విక్రమ్ కుమార్ తో
  • లైన్లోనే ఇంద్రగంటి మోహనకృష్ణ     

నటన పరంగా నానికి వంక బెట్టవలసిన పనిలేదు. ఆయన ఎంచుకునే కథలు .. దర్శకులు ఆయన విజయంలో కీలకమయ్యాయి. చరణ్ వంటి స్టార్ హీరోలు సైతం నాని ప్లానింగ్ ను మెచ్చుకున్నారు. అలాంటి నాని ఈ మధ్య ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేకపోయాడు. జరిగిన పొరపాటును గ్రహించిన ఆయన ఇంతకుముందులానే మంచి మంచి ప్రాజెక్టులను సెట్ చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం ఆయన హారిక హాసిని బ్యానర్లో విభిన్నమైన నేపథ్యంలో 'జెర్సీ' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత మైత్రీ మూవీస్ బ్యానర్లో విక్రమ్ కుమార్ ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడు. ఈ సినిమా తరువాత చేయడానికి దర్శకుడు అనిల్ రావిపూడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది తాజా సమాచారం. వరుస విజయాలతో అనిల్ రావిపూడి మంచి జోరుమీదున్నాడు. కేఎస్ రామారావు నిర్మాతగా ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు తరువాత ఇంద్రగంటి మోహన్ కృష్ణతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. నాని పెర్ఫెక్ట్ గానే ప్లాన్ చేసుకున్నాడు కదూ. 

  • Loading...

More Telugu News