nagarjuna: జనవరి నుంచి సెట్స్ పైకి 'మన్మథుడు 2'

  • 2002లో వచ్చిన 'మన్మథుడు'
  • రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా సీక్వెల్ 
  • త్వరలోనే పూర్తి వివరాలు    

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన సినిమాల్లో 'మన్మథుడు' ఒకటి. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు .. పాటలు పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటికీ ఈ సినిమాకి టీవీల్లో మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తుండటం విశేషం.

అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ రూపొందనుంది. ఈ సీక్వెల్ కి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నాడు. ఇటీవలే ఆయన నాగార్జునకి కథ వినిపించినట్టుగా, ఆయన ఓకే చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ సినిమాను జనవరి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారనేది తాజా సమాచారం. 'మన్మథుడు 2' పేరుతో ఈ సినిమా నిర్మితం కానుంది. కథానాయికలు ఎవరు అనే విషయంతోపాటు, మిగతా వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.    

  • Loading...

More Telugu News