sulakshana: ఆ సీన్ చేసినందుకు అమ్మ చాలా బాధపడింది: సీనియర్ హీరోయిన్ సులక్షణ

  • 'పండంటి కాపురం' కోసం ఆ సీన్ తీశారు 
  • మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది 
  • ఎస్వీరంగారావు మా ఇంటికి వచ్చారు  

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సులక్షణ మాట్లాడుతూ, తాను చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన 'పండంటి కాపురం' సినిమాను గురించి ప్రస్తావించారు. "నేను 'పండంటి కాపురం' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ఆ సినిమాలో నేను చనిపోతే నన్ను గొయ్యిలో పడుకోబెట్టి ఏడుస్తూ ఎస్వీ రంగారావు మట్టి వేస్తారు.

ఆ మరుసటి రోజే నా పుట్టినరోజు. అందువలన నాతో ఆ సీన్ చేయించినందుకు మా అమ్మ ఏడ్చేసింది. నా బిడ్డను గోతిలో పడుకోబెట్టి మట్టి కూడా వేశారు .. మీరు ఈ విధంగా చేయవచ్చా?' అని ఎస్వీ రంగారావు గారితో అంది. అప్పుడు ఆయన 'బాధపడొద్దమ్మా .. వెయ్యేళ్లు బతకాలని ఆశీర్వదిస్తాను' అంటూ మరుసటి రోజు మా ఇంటికి వచ్చారు. నాకు కానుకగా తెచ్చిన ఉంగరం తొడిగి .. చాక్ లెట్స్ ఇచ్చి .. ఆశీర్వదించి వెళ్లారు" అని చెప్పుకొచ్చారు.     

  • Loading...

More Telugu News