ntr: ఆ వార్తలో నిజం లేదు.. రాజమౌళి అడిగితే మాత్రం తప్పకుండా చేస్తాను: కన్నడ స్టార్ హీరో యష్

  • రాజమౌళి గారి మూవీలో నేను లేను 
  • నన్ను ఎవరూ సంప్రదించలేదు
  • ఒక కథానాయికగా కీర్తి సురేశ్?    

రాజమౌళి దర్శకుడిగా ఇటీవలే భారీ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో మెయిన్ విలన్ గా కన్నడ స్టార్ హీరో యష్ నటించనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. అందువలన యంగ్ విలన్ గా యష్ ను తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ విషయంపై యష్ స్పందించాడు. ''రాజమౌళి గారి మల్టీ స్టారర్లో నేను విలన్ గా చేయడం లేదు. ఈ ప్రాజెక్టు నుంచి ఇంతవరకూ నన్ను ఎవరూ సంప్రదించలేదు. ఒకవేళ ఈ సినిమాలో చేయమని రాజమౌళి గారు అడిగితే చేయడానికి నేను సిద్ధంగానే వున్నాను" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు. దాంతో ఇప్పటివరకూ విలన్ యష్ అనుకునేవారిలో మళ్లీ ఆసక్తి మొదలైంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా కీర్తి సురేశ్ పేరు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే.        

  • Loading...

More Telugu News