Pawan Kalyan: రూ. 100 కోట్ల ఆదాయాన్ని మీకోసం వదులుకున్నా.. ఇక మీరే తేల్చుకోండి: పవన్

  • వారు కావాలో, నేను కావాలో మీరే తేల్చుకోండి
  • అమ్మ మాట కాదని మరీ మీ కోసం వచ్చా
  • నేను ఒక్కడినైనా అసెంబ్లీకి వెళ్లేవాడిని

ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వంద కోట్ల రూపాయల ఆదాయాన్ని వదిలిపెట్టుకుని ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు.

వారి కోసమే తాను రోడ్లపైకి వచ్చినట్టు స్పష్టం చేశారు. సత్తా, సమర్థత లేని చంద్రబాబు కావాలో, బాధ్యత లేకుండా రోడ్లపై తిరిగే జగన్ కావాలో, తాను కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. రాజకీయాల్లోకి వెళ్లొద్దన్న అమ్మ మాటను కాదని వచ్చానని, ఫలితంగా దశాబ్ద కాలంపాటు అమ్మతో మాటలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిని కాదని మరీ మీకోసం వచ్చానని పవన్ పేర్కొన్నారు.

జగన్ స్థానంలో తాను కనుక ఉంటే ఎమ్మెల్యేలు అమ్ముడుపోయినా తాను ఒక్కడినే ఒంటరిగా అసెంబ్లీకి వెళ్లేవాడినని పవన్ పేర్కొన్నారు. ఏపీ మంత్రి లోకేశ్‌కు రాజకీయ అనుభవం ఏమాత్రం లేదని పవన్ విమర్శించారు. గతంలో కాంగ్రెస్‌ను తిట్టిన టీడీపీ ఇప్పుడు వారిని మోస్తోందని పవన్ పేర్కొన్నారు.

Pawan Kalyan
Jagan
Chandrababu
East Godavari District
Mandapeta
  • Loading...

More Telugu News