state bank of india: మొబైల్ నంబర్ లేకుంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ బంద్.. ఖాతాదారులకు ఎస్బీఐ హెచ్చరిక!

  • ఈ నెల 30లోగా రిజిస్టర్ చేసుకోండి
  • లేదంటే ఈ-బ్యాంకింగ్ ఆపేస్తామని వెల్లడి
  • మోసాలను అరికట్టేందుకేనని వివరణ

ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కీలక ప్రకటన చేసింది. ఈ నెల 30లోగా తమ మొబైల్ నంబర్లను బ్యాంకు ఖాతాలకు లింక్ చేసుకోవాలని సూచించింది. ఒకవేళ ఈ నెల 30లోగా మొబైల్ నంబర్లను అనుసంధానం చేసుకోకపోతే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు తమ అధికారిక వెబ్ సైట్ లో ఎస్బీఐ ప్రకటించింది.

కొత్తగా తెచ్చిన ఈ సంస్కరణలు డిసెంబర్ 1 నుంచి అమలు అవుతాయని ఎస్బీఐ తెలిపింది. కస్టమర్లు తమ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వీలుగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సైబర్ నేరాలను దీనిద్వారా అరికట్టవచ్చన్నారు. బ్యాంకు బ్రాంచ్ లేదా ఏటీఎం కేంద్రాల ద్వారా ఖాతాదారులు మొబైల్ నంబర్ ను రిజిస్టర్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

state bank of india
internet banking
sbi
warning
customer
  • Loading...

More Telugu News