Uttar Pradesh: ప్రభుత్వ అధికారుల నిర్వాకం.. భర్త ఉండగానే భార్యకు వితంతు పెన్షన్ మంజూరు!

  • యూపీలోని సీతాపూర్ జిల్లాలో ఘటన
  • సందీప్ భార్యకు పెన్షన్ ఇచ్చిన అధికారులు
  • విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్

ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. భర్తలు బతికుండగానే భార్యలకు వితంతు పెన్షన్లు మంజూరు చేసి తమ నిర్వాకాన్ని చాటుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. యూపీకి చెందిన సందీప్ కుమార్ భార్య బ్యాంకు ఖాతాలోకి ఇటీవల రూ.3,000 డిపాజిట్ అయ్యాయి.

దీనికి సంబంధించిన మెసేజ్ సందీప్ ఫోన్ కు వచ్చింది. ఈ మొత్తాన్ని ఎవరు డిపాజిట్ చేశారో తెలుసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన సందీప్ కు అధికారులు చిన్నపాటి షాక్ ఇచ్చారు. ‘ఆమెకు వితంతు పెన్షన్ కింద ఈ మొత్తం డిపాజిట్ అయింది’ అని చెప్పడంతో సందీప్ బిత్తరపోయాడు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ.. తన భార్యకే కాకుండా అత్త, మరదలికి సైతం వితంతు పెన్షన్లను అధికారులు మంజూరు చేశారని వాపోయారు.

ఈ వ్యవహారం మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో ఈ ఘటనపై సీతాపూర్ జిల్లా కలెక్టర్ శితల్ వర్మ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు గల కారణమేంటో ఇంకా తమకు తెలియరాలేదనీ, విచారణ పూర్తయ్యాక దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Uttar Pradesh
widow pension
officials negligence
sitapur collector
emquiry ordered
  • Loading...

More Telugu News