rajani: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న రజనీ

  • ఈ నెల 29న '2.ఓ'
  • తదుపరి సినిమాగా 'పేట్ట'
  • ఫిబ్రవరిలో విడుదల

ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ 'పేట్ట' సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రజనీ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు. విభిన్నమైన కథా కథనాలతో రూపొందుతోన్న ఈ సినిమాపై రజనీకి ఎంతో నమ్మకం వుంది. అందువలన ఆయన ఈ సినిమాను సంక్రాంతికి విడుదలయ్యేలా ప్లాన్ చేసుకున్నారు.

అయితే ఈలోగా ఈ నెల 29వ తేదీన '2.ఓ' సినిమాను రిలీజ్ చేయడానికి శంకర్ సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఎంత భారీ బడ్జెట్ తో రూపొందిందో .. ఎంతటి అంచనాలు వున్నాయో తెలిసిందే. '2.ఓ' రిలీజ్ చేసిన చాలా తక్కువ గ్యాప్ లో 'పెట్ట' రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని రజనీకి సన్నిహితులు చెప్పారట. ఇక డిస్ట్రిబ్యూటర్లు కూడా 'పేట్ట' రిలీజ్ కి మరికాస్త ఎక్కువ గ్యాప్ ఇవ్వమని కోరారట. దాంతో ఈ సినిమాను ఫిబ్రవరిలో విడుదలయ్యేలా చూడమని దర్శకనిర్మాతలతో రజనీ చెప్పినట్టుగా సమాచారం.  

  • Loading...

More Telugu News