cm kcr: ఎన్నికల ప్రచారంలో ప్రజలు నిలదీసినా కోపగించుకోవద్దు: టీఆర్ఎస్ అభ్యర్థులతో సీఎం కేసీఆర్

  • ప్రజలు నిలదీసినా ఓపికతో ఉండాలి
  • నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించండి
  • మన దరిదాపుల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు లేవు

ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజల వద్దకు వెళ్లినప్పుడు ఒకవేళ వారు నిలదీసినా కూడా కోపగించుకోవద్దని, ఓపికగా ఉండాలని తమ పార్టీ అభ్యర్థులకు సీఎం కేసీఆర్ సూచించారు. తమ పార్టీ అభ్యర్థులు 107 మందితో ఈరోజు భేటీ అయిన ఆయన, వారికి బీ-ఫారమ్స్ ను అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేసీఆర్ ఈ మేరకు సూచించినట్టు సమాచారం.

నాలుగేళ్లుగా చేసిన పనులు, సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించి చెప్పాలని పార్టీ అభ్యర్థులకు సూచించారు. మన దరిదాపుల్లో కూడా ప్రతిపక్ష పార్టీలు లేవని, దాదాపు వంద స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ నెల 15 నుంచి రెండు హెలీకాప్టర్లలో తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని, డిసెంబర్ 2 లేదా 3న హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ భేటీలో కేసీఆర్ చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News