Chandrababu: ‘కోడి కత్తి’ విషయంలో ఏం చేయాలో వాళ్లకు అర్థం కావట్లేదంటూ చంద్రబాబు నవ్వులు!

  • మాపై బురదజల్లాలని వైసీపీ అనుకుంది
  • కావాలనే జగన్ ఈ దాడి చేయించుకున్నాడనట్లేదు
  • ఈ ఘటనలో టీడీపీ ప్రమేయం లేదు: చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్ పై దాడి ఘటనకు సంబంధించి ఆ పార్టీ నేతలకు ఏం చేయాలో అర్థం కావట్లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘కోడి కత్తి’ విషయంలో ఏం చేయాలో, ఎలా సమర్థించుకోవాలో వైసీపీ వాళ్లకు అర్థం కావడం లేదంటూ నవ్వులు చిందించారు.

ఈ దాడి ఘటనపై కేంద్రంతో ఎంక్వైరీ చేయించి, ఏవో మాయమాటలు చెప్పి మనపై బురదజల్లే కార్యక్రమం చేయాలని అనుకున్నారని మండిపడ్డారు. జగన్ కావాలనే తనపై ఈ దాడి చేయించుకున్నాడని తానేమీ చెప్పట్లేదని, ఈ దాడి ఘటనలో నూటికి వెయ్యి శాతం తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News