KTR: పొత్తులు పెట్టుకోమని ఏ అమరులు కోరుతున్నారో కోదండరాం వెల్లడించాలి: కేటీఆర్

  • మహాకూటమికి ఓటేస్తే మరణ శాసనమే
  • ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయండి
  • ఎల్లారెడ్డి నియోజకవర్గ సభలో కేటీఆర్ వ్యాఖ్యలు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేటలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ సభలో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో ప్రతిపక్షాలు జట్టుకట్టి అనైతిక పొత్తులు పెట్టుకున్నాయని విమర్శించారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న చంద్రబాబుతో కాంగ్రెస్ జత కట్టిందన్నారు. అమరుల ఆకాంక్షల మేరకు పొత్తులు అని కోదండరాం అంటున్నారని, పొత్తులు పెట్టకోమని ఆయనను ఏ అమరులు కోరుతున్నారో వెల్లడించాలని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడని, కేసీఆర్ అంటే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని అనుకుంటున్నారని కేటీఆర్ కొనియాడారు. మహాకూటమికి ఓటేస్తే మన మరణశాసనం మనం రాసుకున్నట్టేనని విమర్శించారు. ఈ కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు చేతిలో జుట్టుపెట్టి తెలంగాణకు ఏం చేయగలుగుతారని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో ఆషామాషీగా ఓటు వెయ్యెద్దని, ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటేయండని ప్రజలకు సూచించారు. తెలంగాణ కోసం అప్పుడైనా.. ఇప్పుడైనా.. ఎప్పటికైనా నిలబడేది ఒక్క టీఆర్‌ఎస్ పార్టీ మాత్రమేనని కేటీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News