rajamouli: రాజమౌళి సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ .. ఫారిన్ బ్యూటీకి ఛాన్స్

  • రాజమౌళి నుంచి మల్టీ స్టారర్ 
  • ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి 
  • వచ్చేనెల 5వ తేదీన పూజా కార్యక్రమాలు  

రాజమౌళి మల్టీ స్టారర్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తికావడంతో, ఈ సినిమాను నవంబర్ 5వ తేదీన లాంచ్ చేయాలనే నిర్ణయానికి రాజమౌళి వచ్చినట్టుగా చెబుతున్నారు. డీవీవీ దానయ్య 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ - చరణ్ కథానాయకులుగా నటించనున్నారు.

ఈ సినిమాలో మొత్తం ముగ్గురు కథానాయికలు ఉంటారని సమాచారం. ఒక హీరోయిన్ గా ఫారిన్ బ్యూటీ కనిపించనుందని అంటున్నారు. మిగతా ఇద్దరు కథానాయికలు ఎవరనేది కూడా త్వరలో తెలియనుంది. హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సీన్స్ వుంటాయని అంటున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కి సంబంధించిన సన్నివేశాన్ని 45 రోజుల పాటు చిత్రీకరించనున్నారట. దీనిని బట్టి ఆ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు.   

  • Loading...

More Telugu News