Botsa Satyanarayana: ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే సీఎం స్పందించకపోవడం బాధ్యతారాహిత్యం: బొత్స సత్యనారాయణ

  • దాడికి పాల్పడ్డ వ్యక్తి జగన్ ఫ్యాన్ అనడం హాస్యాస్పదం
  • అభిమానులైతే దండాలు పెడతారు, దండలు వేస్తారు
  • హత్యాయత్నం చేస్తారా?

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై హత్యాయత్నం జరిగితే సీఎం చంద్రబాబు స్పందించలేదని, ఆయన బాధ్యతారాహిత్యానికి ఈ సంఘటనే నిదర్శనమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దాడికి పాల్పడిన వ్యక్తి జగన్ ఫ్యాన్ అనడం హాస్యాస్పదమని అన్నారు. అభిమానులైతే కాళ్లకు దండాలు పెడతారు, దండలు వేస్తారు తప్ప హత్యాయత్నం చేస్తారా? అని ప్రశ్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన నిజానిజాలు బయటపెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News