ys jagan: జగన్ పై దాడిని ఖండించిన నారా లోకేశ్

  • ఇది పిరికిపంద చర్య
  • మోడ్రన్ సొసైటీలో ఇలాంటి వాటికి స్థానం లేదు: లోకేశ్
  • ఎయిర్ పోర్ట్ లోకి ఓ వ్యక్తి కత్తితో ఎలా వెళ్లగలిగాడు: జవహర్

విశాఖ ఎయిర్ పోర్ట్ లో వైసీపీ అధినేత జగన్ పై నిందితుడు శ్రీనివాస్ కత్తితో దాడికి పాల్పడటాన్ని మంత్రి నారా లోకేశ్ ఖండించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆధునిక సమాజంలో ఇటువంటి పిరికిపంద చర్యలకు స్థానం లేదని అన్నారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదు: మంత్రి జవహర్

వైసీపీ అధినేత జగన్ పై దాడిని ఏపీ మంత్రి జవహర్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచివి కాదని అన్నారు. ఎయిర్ పోర్ట్ లోపలికి ఓ వ్యక్తి కత్తిని ఎలా తీసుకెళ్లగలిగారని ప్రశ్నించారు. కేంద్ర బలగాల అధీనంలో ఉండే ఎయిర్ పోర్ట్ లో ఈ దాడి ఎలా జరిగిందన్న విషయం పోలీసుల విచారణలో బయటపడుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News