Chandrababu: అప్పుడు ముద్దాయిలు అన్నవారితోనే ఇప్పుడు చంద్రబాబు తిరుగుతున్నారు: కన్నా

  • ఐటీ దాడులకు టీడీపీ ఎందుకు భయపడుతోంది?
  • అవినీతిపరులకు మద్దతిస్తున్న చంద్రబాబు రాజీనామా చేయాలి
  • రాష్ట్ర అభివృద్ధిని పలు పార్టీలు అడ్డుకుంటున్నాయి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డబుల్ గేమ్ ఆడుతున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విమర్శించారు. ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటోందని... తొలుత ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఆ తర్వాత మాట మార్చారని చెప్పారు. ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర అభివృద్ధిని పలు పార్టీలు అడ్డుకుంటున్నాయని మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ నేతలను ముద్దాయిలు అన్న చంద్రబాబు... ఇప్పుడు వారితోనే కలసి తిరుగుతున్నారని అన్నారు.

అవినీతిపరులను అంతమొందించాలని డిమాండ్ చేసిన టీడీపీ... ఇప్పుడు ఐటీ దాడులకు ఎందుకు భయపడుతోందని కన్నా ప్రశ్నించారు. ఐటీ అధికారులు వాళ్ల పని వాళ్లు చేసుకుని వెళుతున్నారని చెప్పారు. ఐటీ దాడులను కూడా రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. అవినీతిపరులకు మద్దతిస్తున్న చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News