ntr: క్లైమాక్స్ లో యుద్ధం వద్దన్నది వారే!: త్రివిక్రమ్

  • యాక్షన్ సీన్ తో క్లైమాక్స్ అనుకున్నాం 
  • ఆ తరువాత ఆ నిర్ణయం మార్చుకున్నాం 
  • ఆడియన్స్ ను మెప్పించగలిగాం

త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా నటించిన ఈ సినిమాకి, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ .. "సాధారణంగా ఏ సినిమాలో అయినా చివరిలో యుద్ధం జరుగుతుంది. అలా కాకుండా ఈ సినిమాలో మేము యుద్ధం తరువాత కథ చెప్పగలిగాము" అన్నారు.

"ఈ విషయంలో ప్రేక్షకులను మెప్పించడం గొప్ప విషయంగానే మేము భావిస్తున్నాము. ఒక రకంగా ఇది ప్రయోగమేనని చెప్పుకోవచ్చు. నిజానికి క్లైమాక్స్ కోసం ఒక యాక్షన్ సీన్ అనుకున్నాము. కానీ యాక్షన్ తో క్లైమాక్స్ వద్దని రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ చెప్పారు. వాళ్ల సూచన అందరికీ నచ్చడంతో అలాగే చేశాము .. అదే కరెక్ట్ అనే రెస్పాన్స్ వచ్చింది . అందుకు రామ్ - లక్ష్మణ్ కి మేము థ్యాంక్స్ చెబుతున్నాము" అన్నారు.    

  • Loading...

More Telugu News