padminireddy: మనసు మార్చుకుంటున్నా.. తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగుతా!: పద్మినీరెడ్డి

  • కాంగ్రెస్ కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకున్నా
  • అందుకే, నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నా
  • ఇంత ప్రతిస్పందన ఉంటుందని ఊహించలేదు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ భార్య పద్మినీ రెడ్డి ఈ రోజు ఉదయం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ పార్టీ నేత లక్ష్మణ్ సమక్షంలో కాషాయ కండువాను కప్పుకున్న ఆమె ఇప్పుడు మనసు మార్చుకున్నారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ ఈరోజు రాత్రి ఆమె సంచలన ప్రకటన చేశారు.

 ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోవేదనను అర్థం చేసుకున్నానని, అందుకే, తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఇంత ప్రతిస్పందన ఉంటుందని తాను ఊహించలేదని, బీజేపీలోకి వెళ్లడం అనుకోకుండా జరిగిన సంఘటనని చెప్పారు.

  • Loading...

More Telugu News