Chandrababu: మోదీ ఇమేజ్ తోనే చంద్రబాబు అధికారంలోకొచ్చారు: కన్నా లక్ష్మీనారాయణ

  • కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు సబబు కాదు
  • ఆ పార్టీని గతంలో దూషించి ఇప్పుడు పొత్తా?
  • చక్కెర పరిశ్రమల మూసివేతకు కారణం చంద్రబాబే

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేశారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు స్వార్థరాజకీయాలు చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీని గతంలో దూషించిన ఆయన, ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం సబబు కాదని అన్నారు.

 మోదీ ఇమేజ్ తోనే చంద్రబాబు అధికారంలోకొచ్చారని వ్యాఖ్యానించారు. చిత్తూరు జిల్లాలో చక్కెర పరిశ్రమలు మూతపడడానికి కారణం చంద్రబాబేనని, చంద్రబాబు తన సొంత జిల్లాకు చేసింది ఇదేనా? అని ప్రశ్నించారు. ఈ జిల్లాలోని గాజులమండ్యం చక్కెర పరిశ్రమను తెరిచే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News