Chandrababu: నాడు ‘కాంగ్రెస్’ను విమర్శిస్తూ చంద్రబాబు చేసిన ట్వీట్లు.. నేడు కేటీఆర్ రీట్వీట్లు!

  • 2014లో ‘కాంగ్రెస్’ను విమర్శిస్తూ బాబు ట్వీట్లు 
  • ఆ ట్వీట్లను ప్రస్తావించిన కేటీఆర్
  • ‘సీబీఎన్ గారి నుంచి వచ్చిన మరో ఆణిముత్యం’ అంటూ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

తెలంగాణలో కాంగ్రెస్- టీడీపీ పొత్తుపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా, మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2014లో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన ట్వీట్ల గురించి ప్రస్తావించారు. చంద్రబాబు చేసిన ఆయా ట్వీట్లను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

‘అవినీతి కాంగ్రెస్ నుంచి దేశాన్ని విముక్తి పరచడమే మన లక్ష్యం. అది సాధించడానికి ఏం చేస్తే ఉత్తమమో మనం అది చేద్దాం. మన నిస్వార్థ కూటమి గురించి చరిత్రే చెబుతుంది’ అని 24/03/2014లో చంద్రబాబు చేసిన ఓ ట్వీట్ ను ప్రస్తావించిన కేటీఆర్.. ‘ఫేమస్ లాస్ట్ వార్డ్స్’ అంటూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

‘తెలంగాణపై రాహుల్, సోనియాలు కొత్తగా ఒలకబోస్తున్న ప్రేమ దుర్మార్గమైంది. తెలంగాణకు చివరిసారిగా వాళ్లు వచ్చింది ఎప్పుడు? అభివృద్ధి కోసం వాళ్లు చేసిందేమిటి?’ అని 26/04/2014న చంద్రబాబు ట్వీట్ గురించి ప్రస్తావించిన కేటీఆర్..‘సీబీఎన్ గారి నుంచి వచ్చిన మరో ఆణిముత్యం’ అని సెటైర్లు వేశారు.

  • Loading...

More Telugu News