gvl: ఏపీలో అధికారపక్ష నేతల అవినీతి సొమ్ము రెండేళ్ల రాష్ట్ర బడ్జెట్ తో సమానం: జీవీఎల్

  • అవినీతి సొమ్మును కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు
  • ఐటీ దాడులు జరుగుతోంది వారి బినామీ కంపెనీల పైనే
  • ఏపీలో ఐటీ శాఖ తనిఖీలు ఇంకా జరగాలి

ఏపీలో అధికారపక్ష నేతలు సంపాదించిన అవినీతి సొమ్ము రెండేళ్ల రాష్ట్ర బడ్జెట్ తో సమానమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అవినీతి సొమ్ము సంపాదించిన నేతలు ఆ సొమ్మును పలు కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారని, అవినీతిపరుల బినామీ కంపెనీల పైనే ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పారు.

ఐటీ దాడులు జరిగిన కంపెనీల్లో అధికార  పార్టీ నేతలు ఆ కంపెనీల్లో బోర్డు సభ్యులుగా లేనప్పుడు భయమెందుకు? అని ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో ఫైవ్ స్టార్ హోటళ్లను మించిన భవనాలను కట్టుకున్నారని, ఏపీలో ఐటీ శాఖ తనిఖీలు ఇంకా జరగాలని జీవీఎల్ అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News