ntr: 'ఆకు చాటు పిందె తడిసె'.. బాలయ్యతో కలసి ఉర్రూతలూగించనున్న రకుల్ ప్రీత్ సింగ్

  • 'ఎన్టీఆర్' బయోపిక్ లో రకుల్ ప్రీత్ సింగ్
  • శ్రీదేవి పాత్రను పోషించనున్న రకుల్
  • శరవేగంగా కొనసాగుతున్న షూటింగ్

దివంగత నందమూరి తారక రామారావు జీవిత కథతో తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' చిత్రం 'కథానాయకుడు', 'మహా నాయకుడు' పేర్లతో రెండు భాగాలుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సినీ పరిశ్రమకు చెందిన ఎందరో స్టార్లు నటిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ చిత్రంలో మెరవబోతోంది. శ్రీదేవి క్యారెక్టర్ ను ఆమె చేయబోతోంది.

'వేటగాడు' చిత్రంలోని 'ఆకు చాటు పిందె తడిసె' సాంగ్ లో బాలయ్యతో కలసి రకుల్ రంజింపజేయబోతోంది. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తొలి భాగం జనవరి 9న, రెండో భాగం జనవరి 24న విడుదల కానున్నాయి.

  • Loading...

More Telugu News