komati reddy: కోమటిరెడ్డికి ప్రజలే సన్యాసం ఇస్తారు: టీఆర్ఎస్ నేత భూపాల్ రెడ్డి

  • నల్గొండలో అన్ని స్థానాలను టీఆర్ఎస్సే గెలుస్తుంది
  • కోమటిరెడ్డి  తన నోటిని అదుపులో పెట్టుకోవాలి
  • తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించింది

నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాల్లో గెలుస్తుందని... లేకపోతే తాను గెలిచినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నల్గొండ టీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి స్పందిస్తూ, వచ్చే ఎన్నికల్లో కోమటిరెడ్డికి ప్రజలే సన్యాసం ఇస్తారని అన్నారు. నల్గొండ జిల్లాలో అన్ని స్థానాలను టీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి తన నోటిని అదుపులో పెట్టుకోవాలని హితవు పలికిన భూపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ శనిలా దాపురించిందని అన్నారు.

  • Loading...

More Telugu News