Chandrababu: ఐటీ దాడులు బీజేపీ అస్త్రం...అప్రమత్తంగా ఉండండి : సహచరులకు సీఎం చంద్రబాబు సూచన

  • ఎన్నికలు జరిగే ఏ రాష్ట్రంలోనైనా ఇదే తీరు
  • భయపడేది లేదు
  • రాష్ట్ర ప్రయోజనాల కోసం దేనికైనా సిద్ధం

ఎన్నికలు జరుగుతున్నప్పుడు విపక్ష పార్టీలను బెదిరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సర్వసాధారణంగా ప్రయోగించే అస్త్రం ఆదాయ పన్ను శాఖ (ఐటీ) దాడులని, అందువల్ల అంతా అప్రమత్తంగా ఉండాలని సహచరులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచించారు. గతంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ఇలాగే వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఐటీ దాడులు రాజకీయవర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న నేపథ్యంలో సీఎం శుక్రవారం టీడీపీ సీనియర్లతో మాట్లాడారు. పార్టీ నేతలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజీపడే ప్రసక్తేలేదని, తమ  ప్రయోజనాలు కాపాడుకుంటామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News