Telangana: తెలంగాణను కేసీఆర్ కుటుంబం గజదొంగల్లా దోచుకున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు
  • అటువంటి వాళ్లను ‘బట్టేబాజ్’ అంటారు: ఉత్తమ్
  • కేసీఆర్ వ్యాఖ్యలకు తామేమీ భయపడమన్న భట్టి

తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం గజదొంగల్లా దోచుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ నిన్న చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన ఘాటుగా స్పందించారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని వాళ్లను హైదరాబాద్ లో ‘బట్టేబాజ్’ అంటారని అన్నారు. మరో నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, కేసీఆర్ లాంటి దొరలను కాంగ్రెస్ పార్టీ తరిమికొట్టిందని అన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలకు తామేమీ భయపడమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News