kavitha: మంచి స్కీంలు ఇచ్చే ప్రభుత్వం కావాలంటే టీఆర్ఎస్ కు ఓటు వేయండి: కవిత

  • రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నేత కేసీఆర్
  • ప్రతి గ్రామానికి నీరు ఇస్తున్నారు
  • ఆడ బిడ్డలంతా ధైర్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తున్నారు

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని టీఆర్ఎస్ ఎంపీ కవిత కొనియాడారు. కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉన్న రాష్ట్రాన్ని... 24 గంటలు కరెంట్ సరఫరా ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దారని చెప్పారు. ప్రతి గ్రామానికి నీరు ఇస్తున్న ఘనత టీఆర్ఎస్ దేనని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

ఒకప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్లని ఆడబిడ్డలు ఇప్పుడు ధైర్యంగా ప్రభుత్వ దవాఖానాలకు పోయి వైద్యం చేయించుకుంటున్నారని కవిత అన్నారు. దానికి కారణం కేసీఆర్ కిట్ల పంపిణీయే కారణమని కవిత చెప్పారు. మంచి స్కీములు ఇచ్చే ప్రభుత్వం కావాలంటే టీఆర్ఎస్ కు ఓటు వేయాలని... స్కాములున్న ప్రభుత్వం కావాలంటే మరో పార్టీకి ఓటు వేయాలని అన్నారు.

  • Loading...

More Telugu News