allu arjun: బన్నీకి ఆ దర్శకులిద్దరూ కథలు వినిపించారట!

  • విక్రమ్ కుమార్ ప్రాజెక్టుపై సందేహాలు 
  • త్రివిక్రమ్ ప్రాజెక్టుపై ఆసక్తి 
  • కథలు వినిపించిన మారుతి - పరశురామ్

'నా పేరు సూర్య' సినిమా తరువాత బన్నీ ఇంతవరకూ ఏ కథను ఓకే చేయలేదు. విక్రమ్ కుమార్ చెప్పిన కథ విన్నాడనీ .. సెకండాఫ్ లో మార్పులు చెప్పాడని కొంతమంది అంటున్నారు. విక్రమ్ కుమార్ ప్రాజెక్టును పక్కన పెట్టేసి .. త్రివిక్రమ్ తో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో బన్నీ వున్నాడని మరికొంతమంది చెబుతున్నారు. ఈ నేపథ్యంలో బన్నీకి కథలు వినిపించడానికి యువదర్శకులు చాలామంది గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట.

తాజాగా బన్నీకి పరశురామ్ .. మారుతి కథలు వినిపించినట్టుగా సమాచారం. అయితే ఈ ఇద్దరిలో ఎవరికీ కూడా బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు. త్వరలోనే ఆయన ఈ రెండు ప్రాజెక్టుల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం వుందని చెబుతున్నారు. త్రివిక్రమ్ తో ప్రాజెక్టు విషయంలో క్లారిటీ వచ్చాకే బన్నీ తన నిర్ణయాన్ని చెప్పే ఛాన్స్ ఉందని అంటున్నారు. గత రెండు సినిమాలు ఆశించినస్థాయిలో ఆడకపోవడం వలన, ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో బన్నీ వున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి మరి.   

  • Loading...

More Telugu News