prabhas: 20వ చిత్రం షూటింగు కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్

  • ప్రభాస్ చేతిలో మరో భారీ సినిమా 
  • ఇటలీలో మొదలైన షూటింగు
  • కథానాయికగా పూజా హెగ్డే

ప్రస్తుతం ప్రభాస్ తన 19వ సినిమాగా 'సాహో' చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఎక్కువ భాగాన్ని విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా షూటింగుకి బ్రేక్ ఇచ్చిన ప్రభాస్, తన 20వ సినిమా కోసం ఇటలీ వెళ్లాడు. ప్రభాస్ 20వ సినిమాను గోపీకృష్ణ మూవీస్ .. యూవీ క్రియేషన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది.

సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగు ఇటలీలో జరుగుతోంది. 24వ తేదీన ఈ సినిమా షూటింగులో ప్రభాస్ జాయినైనట్టుగా తెలుస్తోంది. ఆ సమయంలోనే స్థానిక అధికారులతో ఆయన దిగిన ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చరిత్రతో ముడిపడిన ప్రేమకథా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ కొత్త లుక్ తో కనిపిస్తాడని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తారట.   

  • Loading...

More Telugu News