Road Accident: దేశంలో తొలిసారి సరికొత్త బిల్లును తీసుకొచ్చిన కర్ణాటక.. రాష్ట్రపతి ఆమోదం!

  • రోడ్డు ప్రమాద ఘటనల్లో బాధితులను ఆదుకునేలా ప్రోత్సహిస్తున్న చట్టం
  • బాధితులను ఆదుకుంటే ఇక కేసులుండవు
  • రెండేళ్ల క్రితమే రాష్ట్రపతికి పంపిన ప్రభుత్వం

కర్ణాటక ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా అత్యవసర సందర్భాల్లో రక్షణ బిల్లును తీసుకొచ్చింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఈ బిల్లుకు ఆమోదముద్ర వేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న వారిని రక్షించే ఉద్దేశంతో ఈ బిల్లును రూపొందించారు. సాధారణంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించి ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు చాలామంది జంకుతుంటారు. పోలీసు కేసులు, చట్టపరమైన సమస్యలు మనకెందుకంటూ వాటి జోలికి పోరు. అయితే, ఇకపై అలాంటి భయాలు అవసరం లేకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. బాధితులను రక్షించే వారికి పోలీసు కేసులు, చట్టపరమైన ఇబ్బందుల నుంచి విముక్తి కల్పించడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.

కర్ణాటక జీవరక్షక, వైద్య సాయం (అత్యవసర సందర్భాల్లో రక్షణ) నియంత్రణ బిల్లు-2016గా వ్యవహరించే ఈ బిల్లును రెండేళ్ల క్రితమే అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతికి పంపారు. ఇప్పుడీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించినట్టు  రవాణా శాఖ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ తెలిపారు. ఈ చట్టం ప్రకారం రోడ్డు ప్రమాదాలు, ఘర్షణల్లో కత్తిపోట్లు వంటి వాటితో గాయపడిన బాధితులను ఆసుపత్రికి తీసుకెళ్లిన వారిపై ఎటువంటి కేసులు ఉండవు. బాధితులను రక్షించిన వారిని విచారణ పేరిట ఇబ్బందులకు గురిచేయరు.

Road Accident
Karnataka
Kumara swamy
President Of India
Bill
  • Loading...

More Telugu News