Pawan Kalyan: తెల్లవారుజామున రహస్య పూజలు నిర్వహించిన పవన్ కల్యాణ్

  • ఐఎస్ జగన్నాథపురం లోని నరసింహస్వామి ఆలయంలో పూజలు
  • అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారన్న ఆలయ అధికారులు
  • ఈరోజు పోలవరం ముంపు మండలాల్లో పర్యటించనున్న పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ తెల్లవారుజామున రహస్య పూజలు నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఐఎస్.జగన్నాథపురంలో ఉన్న నరసింహస్వామి ఆలయంలో ఈ తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుంచి 4.30 వరకు ఆయన పూజలు చేశారు. ఈ సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారని ఆలయ అధికారులు తెలిపారు. అయితే, ఈ పూజలను ఎందుకు నిర్వహించారనే విషయం మాత్రం తెలియరాలేదు.

సినీ క్రిటిక్ కత్తి మహేష్ గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ, ఇదే ఆలయంలో పవన్ కల్యాణ్ తాంత్రిక పూజలు నిర్వహించారని ఆరోపించారు. మరోవైపు ఈరోజు పోలవరం ముంపు మండలాల్లో పవన్ పర్యటించనున్నారు. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని భూనిర్వాసితులతో ఆయన భేటీ కానున్నారు.

  • Loading...

More Telugu News