pragathi bhavan: ప్రగతిభవన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం వార్త కలకలం!

  • ‘ఉస్మానియా’లో వైద్యం సరిగా అందని వ్యక్తి
  • కేసీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వైనం
  • ఆత్మహత్యకు యత్నించాడని పొరపడ్డ పోలీసులు 
  • గాంధీ ఆసుపత్రికి తరలింపు

హైదరాబాద్ లోని ప్రగతి భవన్ ఎదుట ఓ వ్యక్తి కాలిన గాయాలతో ఉండటంతో చూసిన పోలీసులు, అతను ఆత్మహత్యాయత్నం చేశాడని భావించారు. వెంటనే, చికిత్స నిమిత్తం అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆ వ్యక్తి చెప్పిన విషయం విని, అందరూ ఆశ్చర్యపోయారు.

చాదర్ ఘాట్ లో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడ్డ తనకు ఉస్మానియా ఆసుపత్రి వైద్య సిబ్బంది సరిగా వైద్యం అందించకపోగా తనపై దాడికి పాల్పడ్డారని, ఈ విషయమై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదు చేసేందుకు తాను ప్రగతిభవన్ కు వెళ్లానని చెప్పాడు. తాను ఆత్మహత్యకు పాల్పడలేదని, తన గాయాలు చూసి పొరపడ్డ పోలీసులు, తనను ఆసుపత్రికి తరలించారని అన్నాడు.

  • Loading...

More Telugu News