modi: మోదీ అంటే వైసీపీ నేతలకు వణుకు.. పిరికిపందల్లా పారిపోయి వచ్చారు: చంద్రబాబు

  • మోదీని విమర్శిస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయం
  • తెలుగువారి పౌరుషానికి టీడీపీ ప్రతీక
  • వైసీపీ నేతలు పార్లమెంటులో కానీ, అసెంబ్లీలో కానీ లేరు

ప్రధాని మోదీ అంటే వైసీపీ నేతలకు వణుకు పుడుతుందని... అందుకే రాష్ట్రానికి ఆయన తీవ్ర అన్యాయం చేస్తున్నా, వైసీపీ నేతలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు. మోదీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు పార్లమెంటులో లేరని, ఇక్కడ అసెంబ్లీలో కూడా లేరని అన్నారు. ఢిల్లీ నుంచి పారిపోయి వచ్చిన పిరికిపందలు ఈ వైసీపీ నేతలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లిగూడెంలో జరిగిన ధర్మపోరాట దీక్షలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలుగువారి పౌరుషానికి తెలుగుదేశం పార్టీ ప్రతీక అని చంద్రబాబు చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది టీడీపీ ఎంపీలేనని అన్నారు. మోదీ బెదిరిస్తే భయపడే రకం టీడీపీ కాదని... ఇది ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి ఒక బెబ్బులిపులిలా, ఒక కొండవీటి సింహంలా ముందుకు వెళతారని అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటులో మోదీ మాట్లాడిన వీడియోను ప్లే చేశారు. 

  • Loading...

More Telugu News