Nitya Menon: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మళ్లీ బిజీ అవుతున్న నిత్యా మీనన్
  • కొత్త జోనర్ లో చేస్తున్న రవితేజ 
  • 6 కోట్లకు విజయ్ సినిమా డబ్బింగ్ రైట్స్

*  మల్లూ బేబీ నిత్యామీనన్ కథానాయికగా మళ్లీ బిజీ అవుతోంది. ఇప్పటికే తెలుగులో 'ఎన్టీఆర్' బయోపిక్ లో సావిత్రి పాత్ర పోషించడానికి అంగీకరించిన ఈ చిన్నది, తమిళంలో రెండు చిత్రాలను ఒప్పుకుంది. వీటిలో ఒకటి జయలలిత బయోపిక్ 'ద ఐరన్ లేడీ' కాగా, మరొకటి 'సైకో'. ఉదయనిది స్టాలిన్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో రూపొందే ఈ సైకో చిత్రం షూటింగులో నిత్యా మీనన్ జాయిన్ అయింది.
*  రవితేజ తొలిసారిగా ఓ యాక్షన్ సైంటిఫిక్ థ్రిల్లర్ లో నటించనున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తారు. వీరిలో ఒకరిగా నభా నటేష్ ను ఇప్పటికే ఎంపిక చేశారు.
*  తమిళ హీరో విజయ్ నటిస్తున్న తాజా చిత్రం 'సర్కార్' తెలుగు డబ్బింగ్ రైట్స్ భారీ ధర పలికాయి. నిర్మాత అశోక్ వల్లభనేని ఈ హక్కులను 6 కోట్లకు సొంతం చేసుకున్నట్టు సమాచారం. నవంబర్ 7న ఈ చిత్రం విడుదల అవుతుంది.

  • Loading...

More Telugu News