KTR: దీన్ని కూడా ‘కాంగ్రెస్’ మేనిఫెస్టోలో పెడుతోందట!: కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

  • పెళ్లి కానోళ్లకు పిల్లనూ వెతికిపెడతామంటారు
  • మూడు పూటలా వండిపెడతామనీ చెబుతారు
  • మీ పిల్లల డైపర్లూ మారుస్తామంటారు
  • కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ సెటైర్లు

పెళ్లి కానోళ్లకు పిల్లను వెతికిపెడతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతారని తనకు ఇప్పుడే వార్త అందిందంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాగర్ కర్నూల్ లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘పెళ్లయిన తర్వాత మీ ఇంట్లో మేమే వచ్చి మూడు పూటలా వండిపెడతాం.. ఆ తర్వాత గోరుముద్దలు కూడా మీ పిల్లలకు మేమే తినిపిస్తాం. ఆఖరికి, మీరు బిజీగా ఉంటే మీ పిల్లల డైపర్లు కూడా మేమే మారుస్తామని చెబుతారు’ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎద్దేవా చేశారు.

ప్రజల ఓట్లు వేయించుకున్న తర్వాత నాగం జనార్దన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పత్తా ఉండరని, అటువంటి వాళ్లకు ఓట్లు వేస్తారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీడీపీపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయాలనే లక్ష్యంతో నాడు టీడీపీని ఎన్టీఆర్ స్థాపించారని, నేడు ఆ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటోందని, ఇందుకు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అన్నారు.

  • Loading...

More Telugu News