Supreme Court: సుప్రీంకోర్టు తీర్పుపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఆందోళన చెందొద్దు: కారెం శివాజీ

  • పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు నష్టం కలగదు
  • పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తాం
  • ఎస్సీ, ఎస్టీలకు ఇది రాజ్యాంగమిచ్చిన హక్కు

పదోన్నతుల రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పుపై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ భరోసా అన్నారు. ఏపీ సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు తమ ప్రభుత్వం రక్షణ కవచంగా ఉంటుందని, సుప్రీం కోర్టు తీర్పు కారణంగా పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎటువంటి నష్టం కలగదని చెప్పారు.

పదోన్నతుల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని, ఎస్సీ, ఎస్టీలకు ఇది రాజ్యాంగమిచ్చిన హక్కు అని, క్రీమిలేయర్ విధానాన్ని అమలు చేయాలని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదని, వెనుకబాటుతనం, ప్రాతినిధ్యం, పరిపాలన దక్షత ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తుంటారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అమెరికా పర్యటన నుంచి సీఎం చంద్రబాబునాయుడు వచ్చాక సమావేశమై ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులతో కలిసి చర్చిస్తామని, ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలపై సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో చర్చించిన విషయాన్ని గుర్తుచేశారు.

  • Loading...

More Telugu News