asia cup: ఆసియా కప్.. భారత్ విజయ లక్ష్యం 238 పరుగులు

  • దుబాయ్ వేదికగా భారత్-పాక్ మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు
  • రెండేసి వికెట్లు పడగొట్టిన బుమ్రా, చాహల్, యాదవ్  

ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న సూపర్- 4 మ్యాచ్ లో భాగంగా భారత్ కు 238 పరుగుల విజయ లక్ష్యాన్ని పాకిస్థాన్ జట్టు నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది.

పాకిస్థాన్ స్కోర్: 237/7

ఇమామ్ ఉల్ హక్ (10), ఫాకర్ జమన్ (31), బాబర్ అజం (9), సర్ఫరాజ్ అహ్మద్ (44), షోయబ్ మాలిక్ (78), అసిఫ్ అలీ (30), షాదాబ్ ఖాన్ (10), మొహమ్మద్ నవాజ్ 15 పరుగులతో, హసన్ అలీ 2 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

భారత్ బౌలింగ్:  బుమ్రా- 2, చాహల్- 2, కులదీప్ యాదవ్- 2

  • Loading...

More Telugu News