Krishna District: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్ల మధ్య నలిగిపోయిన ఆటో!

  • ఈ రోజు తెల్లవారుజామున ఘటన
  • స్విఫ్ట్ కారు, ఆటో ఢీ
  • ఆటోను వెనుకవైపు నుంచి ఢీకొట్టిన సఫారీ

కృష్ణా జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంచికచర్లలోని మార్కెట్ యార్డు సమీపంలో జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న స్విఫ్ట్ కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. అదే సమయంలో ఆటో వెనుకే వస్తున్న సఫారీ కారు ఆటోను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో స్విఫ్ట్ కారులో ప్రయాణిస్తున్న దీప్తి అనే మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News