Raviteja: రవితేజ హీరోగా 'డిస్కో రాజా'

  • ముగింపు దశలో 'అమర్ అక్బర్ ఆంటోని'
  • తదుపరి సినిమా సంతోష్ శ్రీనివాస్ తో 
  • డిసెంబర్ నుంచి వీఐ ఆనంద్ మూవీ  

ప్రస్తుతం రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ అంటోని' సినిమా రూపొందుతోంది. సాధ్యమైనంత త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తరువాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. దసరాకి ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.

ఈ సినిమాతో పాటు రవితేజ మరో ప్రాజెక్టుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమాకి దర్శకుడిగా వీఐ ఆనంద్ వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి 'డిస్కో రాజా' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపుగా ఈ టైటిల్ నే ఖరారు చేయవచ్చని అంటున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్లో లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది.   

  • Loading...

More Telugu News