asia cup: హై టెన్షన్ మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్.. జట్ల వివరాలు

  • దుబాయ్ లో ఇండియా, పాకిస్థాన్ ల మధ్య మ్యాచ్
  • ప్రత్యక్షంగా వీక్షించనున్న ఇమ్రాన్ ఖాన్
  • ప్రేక్షకులతో నిండిపోయిన స్టేడియం

ఆసియా కప్ లో హైటెన్షన్ మ్యాచ్ మరి కొన్ని క్షణాల్లో ప్రారంభం కాబోతోంది. భారత్, పాకిస్థాన్ తో పాటు ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులంతా ఎదురు చేస్తున్న మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. ఆసియా కప్ లో భాగంగా దాయాదుల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచింది.

 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ ను టాస్ చేయగా... పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ టెయిల్స్ కోరాడు. టాస్ టెయిల్ పడటంతో... పాక్ కెప్టెన్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దుబాయ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ ను పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. స్టేడియం మొత్తం ప్రేక్షకులతో నిండిపోయింది.

ఇండియన్ టీమ్: రోహిత్ శర్మ, ధావన్, అంబటి రాయుడు, ధోనీ, కార్తీక్, జాధవ్, పాండ్యా, భువనేశ్వర్, బుమ్రా, చాహల్, కుల్దీప్

పాకిస్థాన్ టీమ్: ఇమామ్, ఫక్తర్, బాబర్, షోయబ్ మాలిక్, సర్ఫరాజ్, ఆసిఫ్ అలీ, షాదాబ్, ఫహీమ్, ఆమిర్, హసన్, ఉస్మాన్ ఖాన్. 

  • Loading...

More Telugu News