Tech-News: షియోమీ నుండి మరో స్మార్ట్ ఫోన్!

  • ఈనెల 19న విడుదల కానున్న 'ఎంఐ 8 యూత్'
  • మొదటగా చైనాలో విడుదల 
  • త్వరలోనే భారత మార్కెట్లోకి

షియోమీ నుండి మరో స్మార్ట్ ఫోన్ రాబోతోంది. 'ఎంఐ 8 యూత్' పేరిట నూతన ఎడిషన్‌ ని చైనా మార్కెట్లో ఈనెల 19న విడుదల చేయనుంది. పలు రకాల కలర్ వేరియెంట్లలో లభించే ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ ధరని విడుదల రోజే ప్రకటించనుంది.

ప్రత్యేకతలు:

  • 6.26" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే (2280 x 1080 రిజల్యూషన్)
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 710 ప్రాసెసర్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 4/6/8 జీబీ ర్యామ్
  • 32/64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ (256 జీబీ వరకు పెంచుకోవచ్చు)
  • వెనక భాగంలో 12/5 మెగాపిక్సల్ కెమెరాలు 
  • ముందు భాగంలో 24 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 3250 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్

  • Loading...

More Telugu News