karunanidhi: నేను పుట్టగానే నా పెళ్లి నిశ్చయం చేసేశారు!: ఆసక్తికర విషయం చెప్పిన కరుణానిధి కుమార్తె

  • కోడలు పుట్టిందని అక్కకు లేఖరాసిన కరుణ
  • ఇంటర్వ్యూలో తండ్రిని గుర్తుచేసుకున్న సెల్వీ
  • నాన్న లేని కుటుంబం శూన్యంగా అనిపిస్తోందని ఆవేదన

ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) అధినేత కరుణానిధి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కుమార్తె సెల్వీ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను పుట్టగానే నా పెళ్లి నిశ్చయమైపోయింది. నేను పుట్టిన కొద్దిసేపటికే మా నాన్న ‘సెల్వం కోసం సెల్వి పుట్టింది’ అని తన అక్కకు లేఖ రాశారట. ఏ పరిస్థితి ఎదురైనా కుటుంబం మాత్రం విడిపోకూడదని నాన్న తరచుగా చెప్పేవారు’’ అని వెల్లడించారు.


తోటి నాయకులను కరుణానిధి అమితంగా గౌరవించేవారనీ, తమను కూడా అలాగే పెంచారని సెల్వీ అన్నారు. ‘ఓసారి మా ఇంటికి నెడుంజెలియన్ వచ్చారు. దీంతో నేను నాన్న దగ్గరకు వెళ్లి..‘నెడుంజెలియన్ వచ్చారు’ అని చెప్పా. నాన్న వెంటనే కొప్పడ్డారు. పెద్దవాళ్లను అలా పేర్లతో పిలవొద్దనీ, నెడుంజెలియన్ ను నావలర్ అని, మరో నేత అన్బళగన్ ను పేరాసియర్ (ప్రొఫెసర్) అని మర్యాదగా పిలవాలని సూచించారు. సినిమాలు, సభలకు నాన్న మమ్మల్ని తీసుకెళ్లేవారు. తిరిగి వస్తున్నప్పుడు వాటిపై మా అభిప్రాయాన్ని తెలుసుకునేవారు’’ అని సెల్వీ తెలిపారు. ఇప్పుడు కరుణానిధి లేకపోవడంతో కుటుంబంలో శూన్యం ఆవరించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కరుణానిధికి చేపల కూరంటే చాలా ఇష్టమని సెల్వీ అన్నారు. తాము కుటుంబంతో సహా ఢిల్లీ వెళ్లినప్పుడు ఇందిరాగాంధీతో కలసి భోజనం చేయడం జీవితంలో మరచిపోలేని ఘటన అని ఆమె వెల్లడించారు.

  • Loading...

More Telugu News